అంతర్జాతీయ జంప్ రోప్ పోటీలకు ఎంపికైన తెలంగాణ విద్యార్థులు

 

కూకట్ పల్లి (జనంసాక్షి ):

18 నుండి 22 వరకు థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో జరిగే క్వీన్స్ కప్ పోటీలలో తెలంగాణ నుండి ఎం. ప్రహన్య(10 సంవత్సరాలు )సి.మధు కిషోర్ (13 సంవత్సరాలు) ఎంపిక అయ్యారు. క్రీడారంగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచి క్వీన్స్ కప్ కు హర్హత సాధించిన విద్యార్థులను మెదక్ ఎస్పీ ప్రియాంక అభినందిచారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దేశానికి పథకం సాధించి దేశ ప్రతిష్టను పెంపొందించాలని, ఆ మేరకు ఏకాగ్రతతో ప్రాక్టీస్ చేసి విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమానికి జంప్ రోప్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈసీ మెంబర్ ఎం.రాజేంద్రప్రసాద్ హాజరైనారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం తరపున పథకం సాధించి వారి తల్లిదండ్రులకు,రాష్ట్రానికి ,దేశానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.