అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

వరంగల్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి)
:  కరడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను విశాఖపట్టణం సీసీఎస్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఈ ముఠాలోని ఐదుగురిని అరెస్ట్‌ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరి నుంచి 473 గ్రాముల బంగారం, కిలోన్నర వెండి, రూ.5.66 లక్షల నగదు, రెండు బైక్‌లు, రెండు కెమెరాలు, ఒక బైనాక్యులర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో తోట శివభవానీ, చీకట్ల సతీష్‌, వామల వినయ్‌కుమార్‌, వామల పుష్పలత, బిట్ల కీర్తిప్రియ ఉన్నారు. అంబటి మధు, మరో వ్యక్తి పరారీలో ఉన్నారని సీసీఎస్‌ పోలీసులు తెలిపారు. ఈ ముఠా మొత్తం 23 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్టు వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు,