అంబులెన్స్ను ఢీకొన్న లారీ
శ్రీకాళహస్తి,నవంబర్26(జనంసాక్షి): రోగిని తీసుకొని బెంగుళూరు నుంచి నెల్లూరు వెళుతున్న ఓ అంబులెన్స్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం కాపుగున్నేరి పంచాయతీ ఇసుకగుంట సవిూపంలో నాయుడుపేట-పూతల పట్టు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్ డ్రైవర్ నిద్రమత్తులో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో డ్రైవర్ తో పాటు రోగి మృతిచెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.