ఖమ్మం, వరంగల్‌ మార్కెట్లకు పోటెత్తిన పత్తి

ఖమ్మం, వరంగల్‌ పత్తి మార్కెట్లకు భారీగా పత్తి బస్తాలు వచ్చాయి. రెండు రోజుల సెలవుల అనంతరం మార్కెట్‌ తెరచుకోవడంతో పత్తి పోటెత్తింది. ఖమ్మం మార్కెట్‌కు ఖమ్మంతోపాటు పొరుగు జిల్లాల నుంచి రైతులు పెద్దమొత్తంలో పత్తిని తీసుకొచ్చారు. అయితే పత్తి ధర భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలు ధర రూ.6200 దాటడం లేదని అంటున్నారు. మార్కెట్‌ అధికారులు వ్యాపారులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.