అక్బరుద్దీన్‌ ఆగడాలకు అడ్డుకట్టవేయండి.. -హోమ్‌ మంత్రికి మహ్మద్‌ పహిల్వాన్‌ కుటుంబసభ్యుల ఫిర్యాదు

హైద్రాబాద్‌, నవంబర్‌22(జనంసాక్షి): అక్బరుద్దీన్‌ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని మహ్మద్‌ పహిల్వాన్‌ కుటుంబసభ్యులు హోమ్‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్‌ తమను వేధిస్తున్నాడని వారు తెలిపారు. ఈ విషయం గురించి తాము పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని, చివరికి కేసున నమోదు  చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇంత వరకూ అతన్ని అరెస్ట్‌ చేయలేదని మండిపడ్డారు. కేసు నమోదు చేసినప్పటి నుండి తమను తీవ్రంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అతన్ని అరెస్ట్‌ చేసి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్నారు.