అక్రమంగా గేదెలను తరలిస్తున్న లారీ సీజ్‌

ఏలూరు,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): అక్రమంగా గేదెలను తరలిస్తున్న లారీని దేవరపల్లి పోలీసులు మంగళవారం సీజ్‌ చేశారు.విజయనగరం నుండి చిత్తూరుకు గేదెలను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్న దేవరపల్లి పోలీసులు,17 గేదెలను స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్‌ చేసిన పోలీసులు ముగ్గురు  వ్యక్తులను  అరెస్ట్‌ చేశారు.