చేతిపై ఆన్సర్లతో వచ్చిన మహిళా అభ్యర్థి

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్లో కాపీయింగ్‌ ఘటన చోటుచేసుకున్నది. కాపీయింగ్‌కు పాల్పడ్డ అభ్యర్థిని సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని డీబార్‌ చేశారు. అధికారులు తెలిపిన వివరాలు.. శుక్రవారం జరిగిన ‘ఎకనామీ అండ్‌ డెవలప్‌మెంట్‌’ పేపర్‌ పరీక్షకు ఇబ్రహీపట్నంలోని సీవీఆర్‌ కాలేజీలో మహబూబ్‌నగర్‌ జిల్లా ఖానాపూర్‌కు చెందిన లక్ష్మి అనే మహిళా అభ్యర్థి పరీక్షకు హాజరైంది.హాల్లోకి వెళ్లాక అభ్యర్థులకు ఆ న్సర్లు షీట్లు అందజేయగానే లక్ష్మి ఆన్సర్‌షీట్‌ వెనుక రఫ్‌షీట్‌లో రాయడం ప్రారంభించిం ది. ప్రశ్నపత్రం ఇవ్వకముందే ఆమె ఆన్సర్లు రాయడాన్ని గమనించిన ఇన్విజిలెటర్లు తని ఖీ చేయగా.. చేతిపై ఆన్సర్లు రాసుకొచ్చినట్లు గుర్తించి డీబార్‌ చేయించారు. అయితే ఈ ఘటనలో మరో వాదన వినిపిస్తున్నది.సద రు మహిళా అభ్యర్థి చీరకొంగులో చీటీ పెట్టుకొచ్చినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. కాగా, గ్రూప్‌-1 మెయిన్స్‌ పేపర్‌-4 పరీక్షకు 67.4 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. 31,383 మందికి 21,195 మంది రాసినట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్‌ నికోలస్‌ వెల్లడించారు.సీల్‌ లేకపోవడంపై అనుమానాలు : సతీశ్‌రెడ్డిగ్రూప్‌-1 మెయిన్స్‌ ఎగ్జామ్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయని బీఆర్‌ఎస్‌ నేత వై సతీశ్‌రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా ఆరోపించారు. ఈ మేరకు సీల్‌ ఉన్న, సీల్‌ లేని ప్రశ్నపత్రాలను పోస్టుచేశారు. సైనిక్‌పురి డిఫెన్స్‌కాలనీ భవన్స్‌ శ్రీరామకృష్ణ విద్యాలయం పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రంపై సీల్‌ లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు.