అనుమానాస్పద స్థితిలో కోతుల మృతి

వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లి సమీపంలో హృదయ విదారక విషాద సంఘటన చోటుచేసుకుంది.శుక్రవారం శాంతినగర్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో సుమారు యాభై కోతులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడి ఉన్నాయి. స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.. మృత్యువాత పడిన కోతులు కుప్పలు కుప్పలుగా ఒకే దగ్గర పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. మూగజీవాలు ఏమైనా విషపూరిత ఆహారం తిన్నాయా..?ఎవరైనా ఎక్కడైనా మరణించిన కోతులను ఇక్కడికి తీసుకు వచ్చి పడి వేసారా అని అనుమానాలు స్థానికంగా చర్చ జరుగుతుంది. పదుల సంఖ్యలో కోతుల మృత్యువాత పడడం స్థానిక ప్రజలను కన్నీటి పర్వతం గురిచేసింది. ప్రతి ఒక్కరు అయ్యో పాపం అంటూ కోతులపట్ల సానుభూతి బాధని వ్యక్తం చేస్తున్నారు సంఘటనపై అధికారులు స్పందించి నిజా నిజాలను వెలికి తీయాలని కోరుతున్నారు. నిజంగా మానవ ప్రమేయం ఉండి ఉంటే ఆగత్యానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.