అఖిలపక్షం వేయడం శుభపరిణామం :గీతారెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యను తేల్చడానికి కేంద్రప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమని మంత్రి గీతారెడ్డి అన్నారు. ఇవాళ ఆమె ఇక్కడ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అఖిలపక్షం వేయడమన్నది తెలంగాణ సమస్య పరిష్కారానికి ఒక అడుగు ముందుకు వేసినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణపై తమ అభిప్రాయాలు వెల్లడించాలని ఆమె కోరారు.