అఖిలపక్షానికి తేదీ ప్రకటించడం చరిత్రాత్మకం :మధుయాష్కి

ఢిల్లీ : అఖిల పక్ష ఏర్పాటుపై తేదీని ప్రకటించడం చరిత్రాత్మకమని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఢిల్లీలో మాట్లాడుతూ కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణవాదులంతా హర్షించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు పోరాటం కోనసాగిస్తామన్నారు. పార్టీకి ఒక్కొక్కర్ని పిలుస్తామని హోంమంత్రి తమకు చెప్పారని ఎంపీ పొన్నం తెలియజేశారు. తెలంగాణ సాధించుకోవడమే తమ ముందున్న ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. తెలంగాణపై తెలుగుదేశం ఏకాభిప్రాయంతో సమావేశానికి రావాలని పొన్నం కోరారు. తెలంగాణపై 8 రాజకీయ పార్టీలు స్పష్టమైన వైఖరి తెలియజేయాలన్నారు.