అట్టహాసంగా ఎడ్ల పరుగు పోటీలు

విజయవాడ,జనవరి23(జ‌నంసాక్షి): దీపక్‌ నెక్స్‌జన్‌ వారి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కైకలూరు మండలం గోపవరం గ్రామంలో బుధవారం రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలను నిర్వహించారు. ఎంపి మాగంటి బాబు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌లు ఈ ఎడ్ల పందేలను ప్రారంభించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి వచ్చిన ప్రజలు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కవిూలీ వీటల్‌ రావు, వైసిపి నాయకులు దూలం నాగేశ్వరావు, జెడ్‌పిటిసి బొమ్మనబోయన వి.జయ లక్ష్మి, బికె.ప్రభాకర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.