అట్టహాసంగా ప్రారంభమైన ఉద్యమ జర్నలిస్టుల సమావేశం

హైదరాబాద్ : బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సమావేశం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. అతిథులు, ప్రముఖ జర్నలిస్టులు హాజరై ప్రసంగిస్తున్నారు. ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఈ సమావేశం పదేండ్ల క్రితం జరగాల్సిన సమావేశం అని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఈ సమావేశం ఎన్నో అవిష్కరణలు, హక్కుల సాధనకు దిక్సూచిగా నిలవాలని ఆకాంక్షించారు.