అట్టహాసంగా శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వర స్వామి నూతన దేవస్థాన, విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం

అట్టహాసంగా శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వర స్వామి నూతన దేవస్థాన, విగ్రహ,  ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంఅట్టహాసంగా శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వర స్వామి నూతన దేవస్థాన, విగ్రహ,  ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాథన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కనకదుర్గ కాలనీ సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో గురువారం నూతన విగ్రహ, ధ్వజస్థంభ ప్రతిష్ట వైభవంగా  నిర్వహించారు.  ఉదయం ఆలయ కర్త దేవోజు రాజశేఖర నంద స్వామి దేవోజు కోటేశ్వర చారి ఆధ్వర్యంలో  ఉదయం ఐదు గంటల నుండి  సుప్రభాత సేవ, వేద పారాయణ, ఆవాహిత దేవతార్చన, శాంతి హవనములు, సుముహూర్తమునకు యంత్ర, విగ్రహ ప్రతిష్టలు, తదుపరి నేత్రోన్మీ లనము, దేను దర్శనం, శిల్పి దర్శనం, సర్వదర్శనం, జయాది హవనం, మహా పూర్ణాహుతి, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు శాంతి కళ్యాణం, నివేదన, మహా మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వితరణ  తడితరా సేవలు ఆలయ ప్రతిష్టాచార్యులు  ఐలాపురం వెంకట శర్మ, బ్రహ్మశ్రీ మద్దూరి స్వామి రాజేశ్వర శర్మ శిష్య గణముచే పూజలు నిర్వహించారు. నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి మంచిర్యాల జిల్లా చైర్పర్సన్  నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు, మందమర్రి జి.ఎం. చింతల లక్ష్మి శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు గాండ్ల వీణ సమ్మయ్య, నందిపేట సరోజన సదయ్య, సుంకరి రాజేశ్వరి రాజేశం, దంపతులు శివ కళ్యాణంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకునీ, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, భారాస పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టిడిపి పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు సంజయ్ కుమార్, సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, బిజెపి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పత్తి శ్రీనివాస్, టి బి జి కే ఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, మందమర్రి భారాస అధ్యక్షులు  రవీందర్, వివిధ పార్టీల నాయకులు, సింగరేణి అధికారులు,భక్తజనం తదితరులు పాల్గొన్నారు.