అడ్డా( గో) ల్ విద్యుత్ బిళ్లులు

రామారెడ్డి అక్టోబర్  17  ( జనంసాక్షీ )
అడ్డగోలుగా విద్యుత్ బిల్లులు దండుకుంటు న్నారని బాధితుల ఆవేదన చెందుతున్నారు రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో  అధిక బిళ్లుల సంఘటన వెలుగు చూసింది . వివరాల్లోకి వెళితే గండ్ర నరసింహులు పోసానిపేట్ వ్యక్తికి చెందిన మీటర్ రీడింగ్   35 రోజులకు 857 యూనిట్లకు గాను   7095 రూపాయల బిల్లు వచ్చిందన్నారు.  బిల్లు  ఇంత మొత్తంలో ఎందుకు వచ్చిందని అధికారులను  అడిగితే 118 రూపాయల డిడి సంబంధిత అధికారుల పేరు మీద తీస్తే మీటర్ ను  ల్యాబ్ కు పంపించారు. మీటరు బాగానే పనిచేస్తుంది కానీ మీ ఇంట్లోనే వైరింగ్ ప్రాబ్లం ఉన్నదని సమాధానం చెప్పుతు న్నారని అన్నారు.  ఇలాంటి బాధితులు పోసానిపేట గ్రామంలో పదిమంది వరకు ఉన్నారని అన్నారు.   అధిక విద్యుత్ బిళ్లులపై జిల్లా అధికారులు చొరవ చూపి పరిస్థితిని చక్కదిద్దాలని వేకున్నారు.  లేని ఎడల గ్రామంలో సర్పంచ్ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
Attachments area