అతి వేగం,ఓవర్ టేక్ వల్ల ఘోర రోడ్డు ప్ర‌మాదం.అతి వేగం,ఓవర్ టేక్ వల్ల ఘోర రోడ్డు ప్ర‌మాదం.ఇద్ద‌రి మ‌ృతి..ఒకరికి తీవ్ర గాయాలు


కోటగిరి ఫిబ్రవరి 17 జనం సాక్షి:-కోటగిరి,పోతంగల్ ప్రధాన రహదారిపై కరమ్ ఇండస్ట్రీస్ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోటగిరి నుండి పోతంగల్ వైపుగా వెళుతున్న ఆర్టీసీ బస్సును,కరమ్ ఇండస్ట్రీ వద్ద బైక్ పై ప్రయాణిస్తున్న డొంగ్లి మండలా నికి చెందిన జబ్బర్,దినేష్,సాయిగొండా అనే ముగ్గు రు వ్యక్తులు అర్టిసి బస్సును ఓవర్ టెక్ చేయడంతో అటు వైపుగా పోతంగల్ నుండి కోటగిరి వైపుగా వస్తున్న ట్రాక్టర్ ను ఢీకొనడంతో బైకుపైన జబ్బర్, దినేష్ ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా సాయిగొండా పరిస్థితి విషమంగా ఉండ‌టంతో స్థానికులు,పోలీసులు హుటా హుటిన‌ 108లో గాయాలైన,మృతి చెందిన వారిని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తుల అతివేగం,ఓవ‌ర్ టేక్ వల్ల ఇట్టి ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు స్తానికులు పేర్కొన్నారు.కోటగిరి పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు