అధిష్టాన నిర్ణయం శిరసావహిస్తా

అధికార మార్పిడికి సహకరిస్తా : సదానందగౌడ
గౌడ పాలన భేష్‌.. గడ్కరీ కితాబు
న్యూఢిల్లీ, జూలై 8 (జనంసాక్షి):
అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని కర్నాటక సిఎం సదానందగౌడ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన ముఖ్యమంత్రి పదవికి రాజీ నామా చేస్తున్నానని చెప్పారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేయనున్నట్టు చెప్పారు. కొత్త ముఖ్యమంత్రికి అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారు. తన 11 నెలల పదవీ కాలంలో ఎన్నో మంచిపనులు చేశానన్నారు. రాజీనామా అనం తరం పార్టీ అభివృద్ధికి మరింత పాటుపడతా నన్నారు. 2014 ఎన్నికల్లో విజయం చేకూర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాజకీయాల్లో కులానికి ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామామేనన్నారు. ఇదిలా ఉండగా బిజెపి అధ్యక్షుడు గడ్కారితో కర్నాటక సిఎం సదానంద సమావేశ మయ్యారు. సమావేశం అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గవర్నర్‌కు సోమవారం రాజీనామా పత్రాన్ని అందజేయనున్నట్టు చెప్పారు.