అన్నదానం.. మహాదానం : గణేష్ కమిటీ సభ్యులు.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 25,జనం సాక్షి.

వినాయక నవరాత్రి ఉత్సవాలను పునస్కరించుకొని దౌల్తాబాద్ మండల కేంద్రంలోని గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టాపించిన వినాయకుడి మండపం వద్ద సోమవారం మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.వినాయక నవరాత్రుల్లో భాగంగా కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలు,వివిధ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు,భక్తులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అంజిరెడ్డి,శ్రీరామ్ శ్రీనివాస్,నర్సింహా రెడ్డి, సాధుల్లా, కరుణాకర్ రెడ్డి,పురుషోత్తం,శ్రీనివాస్,రెడ్డి రవి,శివ,స్వామి తదితరులు పాల్గొన్నారు.