అన్యయం జరిగిన ఎపిని ఆదుకోవాలి

ప్రధాని మోడీకి మాజీమంత్రి వసంత వినతి
అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): ఏపీకి అన్యాయం జరిగిందని ప్రధాని మోడీ ప్వయంగా అగీకరించారని, ఆ మేరకు రాజ్యసభలో మాట్లాడినందుకు ధన్యవాదాలు అని మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా ఏపీకి న్యాయం చేసేందుకు ప్రధాని కృషి చేయాలన్నారు. విభజన చట్టానికి అనుగుణంగా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తానంటే బీజేపీతో సహా ఏ పార్టీకి అభ్యంతరాలు లేవన్నారు. విశాఖ రైల్వే జోన్‌ వెంటనే ఏర్పాటు చేయాలని, వెనుకబడిన ప్రాంతాల నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం త్వరితగతిన పూర్తి చేసి అన్యాయం అయిన ఏపీకి న్యాయం చేయాలని వసంత నాగేశ్వరరావు అన్నారు.