అప్పుల బాధ తో క్రిమిసంహారక మందు తాగి వ్యక్తి మృతి

అప్పుల బాధ తో క్రిమిసంహారక మందు తాగి వ్యక్తి మృతి

భీమదేవరపల్లి సెప్టెంబర్ (27)జనం సాక్షి న్యూస్

అప్పుల బాధ భరించలేక క్రిమి సంహారక మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన దాట్ల ప్రవీణ్ కుమార్(38) వృత్తిరీత్యా కూలీ పని చేస్తుండేవాడు. ఎకరం 20 గుంటల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో తనకున్న భూమిలో వ్యవసాయ బావి తవ్వగా అందులో రాళ్లు రావడం వల్ల నీళ్లు పడలేదు తిరిగి మళ్లీ వేరే దగ్గర బావి తవ్వించగా అప్పుడు కూడా నీళ్లు పడలేదు దనివల్ల తనకు కొంత అపు అయ్యింది బావి తవ్వడం కోసం అప్పు చేశాడు. అయితే చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక సోమవారం ఉదయం 9 గంటలకు పత్తి చేనుకు కొట్టడానికి తీసుకొచ్చిన మందు పొలం వద్ద తాగి పడిపోయాడు పక్క చేను లో ఉన్న వారు చూసి తన అన్న రాజు కుమార్ కు చెప్పగా వెంటనే రాజ్ కుమార్ హుటాహుటీన ప్రవీణ్ ను ముల్కనూర్ సుధాకర్ హాస్పిటల్ అడ్మిట్ చేయగా మెరుగైన వైద్యం కోసం మంగళవారం కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజిఎం లో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున అందాల రెండు గంటలకు మృతి చెందాడని డాక్టర్లు తెలియజేశారు మృతుడికి భార్య తన తండ్రి దాట్ల మొగిలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముల్కనూర్ ఎస్సై సాయిబాబు దర్యాప్తు చేస్తున్నారు