అఫ్గాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 35 మంది మృతి

అఫ్గానిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాందహార్ నుంచి కాబుల్ కు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొంది. ట్యాంకర్ లో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో 35 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.