అఫ్జల్‌గురుకు క్షమాభిక్ష నిరాకరణ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక నిందితుడు అఫ్జల్‌గురుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ క్షమాబిక్ష నిరాకరించాడు. ఈ కేసులో దోషులందరికీ ఉరిశిక్షను అమలుచేయనున్నారు. అఫ్జల్‌తోపాటు ఈ దాడిలో పాల్గొన్న మరో ఆరుగురు ఉగ్రవాదులకు కూడా ఆయన క్షమాబిక్ష నిరాకరించారు. తమకు సుప్రీంకోర్టు విధించిన ఉరిశిక్షను నిలిపివేయమాలని, క్షమాభిక్ష ప్రసాదించాలని దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు రాష్ట్రపతికి పిటిషన్‌ పెట్టుకొన్న విషయం తెలిసిందే.