అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం

కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఇటీవల ప్రతిష్టించిన అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి పంచామృత అభిషేకాలు, ఆకు పూజ, పుష్పాలంకరణ వంటి పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు కనుల పండుగగా నిర్వహించారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జూకూరి అంజయ్య, సెక్రటరీ కోట తిరుపతయ్య, అన్నదాన నిర్వహకులు దేవరశెట్టి హనుమంతరావు, ఆలయ కమిటీ సభ్యులు కృష్ణమూర్తి ,సత్యం, బ్యాటరీ చారి ,వంశీకృష్ణ, అప్పారావు, వాసు, అన్నదాతలు తదితరులు పాల్గొన్నారు.