అమరవీరులకు గౌరవ వందనం సమర్పించిన షిండే

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు చేపడుతూ ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు కేంద్ర హోంమంత్రి షిండే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ గౌరవ వందనం సమర్పించారు. ఈ నెల 25న సహాయక చర్యలు చేపడుతున్న హెలికాప్టర్‌ కూలి 20 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.