అమర్‌నాథ్‌ ప్రయాణం ప్రారంభించిన తొలి బృందం

 జమ్ము : మూడు వేల మందికి పైగా యాత్రికులతో కూడిన తొలి బృందం నేడు అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభించింది. పటిష్ఠమైన భద్రత మధ్య దక్షిణ కాశ్మీర్‌ నుంచి ఈ బృందం బయల్దేరింది. 3,157 మంది ఉన్న యాత్రికుల బృందంలో 563 మంది స్త్రీలు, 37 పిల్లలు ఉన్నారు. జమ్మూ బేస్‌ క్యాంప్‌ నుంచి ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జి.ఎ. మీర్‌ జెండా వూపి యాత్ర ప్రారంభించారు.