అమిత్‌ షా యోగాకు నీ శరీరం సరిపోతుందా?

1

– నితీష్‌ కుమార్‌

పాట్నా 13 జూన్‌ (జనంసాక్షి)

యోగా చేయడానికి సరిపోయే ఒళ్లేనా నీది.. అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను ఉద్దేశించి జేడీయూ నేత, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రతి రోజూ శ్రద్ధగా ఇంట్లోనే యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని సలహా ఇచ్చారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుందన్నారు.  ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పాట్నాలో ఈనెల 21న జరిగే కార్యక్రమంలో అమిత్‌ షా పాల్గొనబోతున్నారు. ఆయనను ఉద్దేశించే నితీష్‌ ఈ విమర్శలు చేశారు.

తాను ఎన్నో ఏళ్లుగా ఇంట్లోనే యోగా చేస్తున్నానని, కానీ ఏ రోజూ పబ్లిసిటీ కోసం చేయలేదని నితీశ్‌ కుమార్‌ తెలిపారు. బీజేపీ మాత్రం యోగాను ఒక పబ్లిక్‌ స్టంట్‌లా

చేస్తోందని విమర్శించారు. పాట్నాలో నిర్వహించే యోగా కార్యక్రమంలో అమిత్‌ షా పాల్గొంటున్న విషయం పేపర్‌లో చూస్తే తెలిసిందన్నారు. రానున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల

నేపథ్యంలో బీజేపీ చేస్తున్న పొలిటికల్‌ స్టంట్‌ గా నితీశ్‌ అభివర్ణించారు.