అయోషా కేసులో.. తనను అన్యాయంగా ఇరికించారు

 

– పోలీసుల చిత్రహింసలతోనే నేరం చేసినట్లు ఒప్పుకున్నా

– సీబీఐ అధికారులతో సత్యంబాబు వాంగ్మూలం

విజయవాడ, జనవరి18(జ‌నంసాక్షి) : అయోషా విూరా హత్యాచారం కేసులో సీఐబీ తన దర్యాప్తులో వేగం పెంచింది. దీనిలో భాగంగా హత్యకేసులో ఇటీవల హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన సత్యంబాబును సీబీఐ అధికారులు శుక్రవారం ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలోని అనాసాగరంలో ఉన్న సత్యంబాబు ఇంటికి ఉదయం నలుగురు సీబీఐ అధికారుల బృందం చేరుకుంది. తొలుత సత్యంబాబు ఇంటిలో తనిఖీలు చేపట్టిన అధికారులు అతడిని ఓ గదిలో బంధించి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సత్యం బాబు మాట్లాడుతూ.. ఈ విచారణలో బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా విూరా హత్యాచారం కేసులో తనను అన్యాయంగా ఇరికించారని సత్యంబాబు సీబీఐ అధికారులకు తెలిపాడు. విచారణ పేరుతో పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారనీ, ఆ హింసలు తట్టుకోలేక నేరం చేసినట్లు ఒప్పుకున్నానని అన్నాడు. ప్రస్తుతం తనకు బతకడానికి పని కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు సెల్‌ ఫోన్లపైన మోజు ఉండేదనీ, అందువల్ల తాను ఫోన్లను దొంగలించానని పేర్కొన్నాడు. అయితే తనను పోలీసులు అయేషా విూరా హత్య కేసులో ఇరికించారని చెప్పాడు. ఆయేషా విూరా హత్య తర్వాత ఏపీ పోలీసులు తనను ఉమా హలీడే రిస్టార్ట్‌ లో రెండ్రోజులు బంధించి టార్చర్‌ పెట్టారని తెలిపారు. తన గొంతుకు దగ్గరగా ఉన్న వ్యక్తితో నేరాన్ని అంగీకరించినట్లు వీడియో వాంగ్మూలాన్ని తయారుచేశారని సీబీఐ అధికారులకు తెలిపాడు. జైలులో తల్లి, చెల్లి తప్ప తనను ఎవరూ కలవలేదనీ, ఏడేళ్లు ఏసు ప్రభువును ప్రార్ధిస్తూ గడిపానని పేర్కొన్నాడు. 2007, డిసెంబర్‌ 27న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా లేడీస్‌ హాస్టల్‌ లో ఆయేషా విూరా(19)పై గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి కిరాతకంగా చంపారు.