అయ్యప్ప స్వామి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని  శ్రీనివాస్ క్యాటరర్స్ అద్వర్యంలో అయ్యప్ప స్వామి పూజ అంగరంగ వైభవంగా జరిగింది.ఈకార్యక్రమములో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు, కార్పొరేటర్ సునీత యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అయ్యప్ప స్వాములు పాడిన భక్తి, భజన గీతాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.అనంతరం గురు స్వామి శ్రీనివాస రావు మాట్లాడుతూ.ఈనెలా 16 తేదీ నుండి వచ్చేనెల 27 తేదీ వరకు అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగుతుందని అయ్యప్ప స్వాములు ప్రతి ఒక్కరు వచ్చి బిక్ష స్వీకరించాలని కోరడం జరిగింది.ఈకార్యక్రమంలో రామూయాదవ్,అయ్యప్ప స్వాములు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.