అవార్డు అందుకున్న ప్రధానోపాధ్యాయులు కొడిపాక రమేష్

కేసముద్రం అక్టోబర్ 16 జనం సాక్షి /ఆదివారం రోజున అవోపా భవన్ నందు
(సుబేదారి)హనుమకొండ లో ఏపీజే అబ్దుల్ కలామ్ జాతీయ టీచింగ్ అవార్డ్-2022 ప్రధానం చేశారు.విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా,ఆరోగ్య భాద్యతలు చేపట్టి వారి సర్వతోముఖాభి వృద్ధికి అహర్నిశలు కృషి  చేసినందుకుగాను  వెనిషెట్టీ జగదీశ్వరయ్య స్మారక సేవా సమితి అధ్యక్షుడు శ్రీ వెనిషెట్టి రవి కుమార్,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన  కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రాఫెసర్ తాటికొండ రమేష్ చేతుల మీదుగా ఈ అవార్డ్ ను కేసముద్రం మండలం పెనుగొండ గ్రామ శివారు నర్సింహులగూడెం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొడిపాక రమేష్ కు అందజేశారు.అవార్డు అందుకున్న ప్రధానోపాధ్యాయులు కొడిపాక రమేష్ ను పలువురు అభినందించారు.
Attachments area