అసెంబ్లీ సమావేశాలకు విూడియాకు నిరాకరణా?

కేవలం పక్షపాత ధోరణితోనే నిరాకరణ
సమావేశాల కవరేజీఇకి విూడియాను అనుమతించాలి
మండలి ఛైర్మన్‌ షరీఫ్‌కు యనమల లేఖ
అమరావతి,నవంబర్‌29 (జనం సాక్షి):  శాసనమండలి సమావేశాలకు విూడియాను అనుమతించాలని, విూడియా  ఛానల్ళను అనుమతించాలని ఛైర్మన్‌ షరీఫ్‌కు టీడీపీ సీనియర్‌ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు.  ‘మండలి సమావేశాల కవరేజీకి అన్ని విూడియా ప్రతినిధులను అనుమతించక పోవడం అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం అన్నారు. ఇది పార్లమెంటరీ వ్యవస్థకు భంగం. వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం, సంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడం శోచనీయం అన్నారు.  చట్టసభలకు ఈటీవీ,  టీవీ5, ఏబీఎన్‌పై ఆంక్షలు విధించడాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా  విూడియా ప్రతినిధులను, కెమెరాలను కూడా శాసనమండలి ప్రాంగణంలోకి అనుమతించడం లేదు. గ్యాలరీల్లోకి కూడా రానివ్వడం లేదు. బ్లూ విూడియాను మాత్రమే అనుమతించి మిగిలిన విూడియా సంస్థల ప్రతినిధులను అనుమతించక పోవడం అప్రజాస్వామికం అన్నారు. ఈ పోకడలు ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలైన చట్టసభలకే విరుద్ధం.  పార్లమెంటరీ వ్యవస్థకు తూట్లు పొడిచేలా వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను గర్హిస్తున్నాం’ అని యనమల అన్నారు. ప్రజాప్రతినిధులు చట్టసభల కు జవాబుదారీతనంగా ఉండాలి. చట్టసభలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది మన రాజ్యాంగ పెద్దల ఆకాంక్ష. సభా ప్రసారాలను ప్రత్యక్షంగా చూసే హక్కు ప్రజలకు ఉంది. ప్రసార సంస్థలు, పార్లమెంటరీ వ్యవస్థ మధ్య బలమైన బంధం ఉంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత వీటిపైనే ఉంది. కొన్ని విూడియా సంస్థలు సభా ప్రాంగణంలోకే రాకూడదు, కెమెరాలు తీసుకు రాకూడదు, గ్యాలరీలోకి వెళ్లకూడదు, లాబీల్లో తిరగరాదనే ఆంక్షల విధింపు అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, పార్లమెంటరీ వ్యవస్థనే కించపర్చడమే అవుతుందని యనమల మండిపడ్డారు. రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఘనుడు. సీఎం సొంత విూడియా ప్రతినిధులను, తన అనుకూల సంస్థల ప్రతినిధులను, కెమెరాలనే సభలోకి అనుమతించడం ఏకస్వామ్యమే తప్ప ప్రజాస్వామ్యం కాదని లేఖలో తెలిపారు.  నేటినుంచి ప్రారంభం కానున్న సభా సమావేశాల్లో దీనినే ప్రధానాంశంగా చేపడ్తాం. దీనిపై శాసనమండలిలోని ఇతర పార్టీల ప్రతినిధులను కూడా కలిసి రావాలని విజ్ఞప్తి  చేస్తున్నాం. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ఛైర్మన్‌ సముచిత రీతిన స్పందించి, కౌన్సిల్‌ ప్రాంగణంలోకి విూడియాను అనుమతించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతున్నామన్నారు.  శాసనమండలి సభ్యులకు అందుబాటులో ఉండేలా కౌన్సిల్‌ లో విూడియా సెంటర్‌ ను ఏర్పాటు చేయాలి. నిష్పక్షపాతంగా కౌన్సిల్‌ ప్రసారాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. విూడియా ప్రతినిధులకు రక్షణ, పూర్తి భద్రత కల్పించాలి. విూడియాకు వ్యతిరేకంగా స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాలు కౌన్సిల్‌ కు వర్తింపచేయకుండా శాసనమండలి ఛైర్మన్‌  సముచిత నిర్ణయం తీసుకోవాలని యనమల లేఖలో విజ్ఞప్తి చేశారు.