ఆందోల్ ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన మీడియా రిపోర్టర్లు

రాయికొడ్ జనం సాక్షి జూలై 19 రాయికొడ్  ఆందోల్ క్యాంపు కార్యాలయంలోఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అమెరికా  ఆటా 17వ మహసభలకు హజరై, అమెరికా పర్యటనను దిగ్విజయవంతంగా పూర్తి చేసుకొని ఆందోల్ నియోజకవర్గానికి విచ్చేసిన శుభసందర్బంగా అందరి అభిమాన నేత,ఆందోల్ స్థానిక ముద్దుబిడ్డ ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆందోల్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు మంగళవారం నాడు శాలువతో సన్మానించి, బొకేను అందజేసి ఆయన ఛాయాచిత్రాన్ని అందించారు.  అభినందనలు తెలిపిన వారిలో ఆందోల్ నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టుర్లు, కె.సంజీవ్ కుమార్ (ఎన్టీవీ), మధు (ఏబీఎన్), పల్లెగడ్డ రాజు (రాజ్ న్యూస్), ఉమాశంకర్ (హెచ్ఎమ్ టీవీ), నదరి రమేష్ (ఐ న్యూస్) ఉన్నారు