ఆజాద్‌తో సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ : కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాంనబీ ఆజాద్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ కానున్నారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న అనంతరం ఆయన కేంద్ర మంత్రి చిదంబరంతో సమావేశమయ్యారు. అక్కడ నుంచి ఆయన ఆజాద్‌ను కలిసేందుకు వెళ్లారు, కాగా, రేపు జరుగబోయే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.