ఆడపడుచులకు బతుకమ్మ పండుగ ఎం పవిత్రమైనది మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి.

*ఆడపడుచులకు బతుకమ్మ పండుగ ఎం పవిత్రమైనది మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి*
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : మహిళలకు ఎంతో పవిత్రమైన పండగ బతకమ్మ పండగని శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్బీనగర్ లో దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆర్బీనగర్ లో మహిళలకు చీరలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగ ప్రకటించి ప్రతి ఒక్కరి ఇంటిలో దసరా పండుగను సంతోషంగా చేసుకోవాలని ఉద్దేశంతోనే ప్రతి ఇంటికి చీరలు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. గతంలో బతుకమ్మ పండుగను, బోనాలను ఏ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగను, బోనాల పండుగను రాష్ట్ర పండుగలుగా ప్రకటించారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకుంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ను, టిఆర్ఎస్ పార్టీని ఎప్పుడు మరవకుండాదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ వెంకటేష్ గౌడ్,కౌన్సిలర్లు పుష్పలత, కో- ఆప్షన్ సభ్యులు సంతోష ప్రభాకర్, నాయకులు కొనమొల శ్రీనివాస్,రాములు, బుచ్చిరెడ్డి ,నగర దీపికలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : ఆర్జీనగర్ లో బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి,
Attachments area