ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

చిత్తూరు,నవంబర్‌28(జనంసాక్షి): ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడు తిరువల్లూర్‌ కి చెందిన ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్మ చేసుకున్న ఘటన బుధవారం కుప్పం రైల్వేస్టేషన్‌ సవిూపంలో చోటు చేసుకుంది. ఉదయం కుప్పం రైల్వేస్టేషన్‌ సవిూపంలో దాలవాయికోతపల్లి సవిూపంలోని రైలు పట్టాలపై రెండు శవాలను రైల్వే పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరించారు. పరిశీలనలో అమ్మాయి పీజీ ఎగ్జామ్‌ రాసిన హాల్‌ టికెట్‌ లభించింది. మృతుల పేర్లు మోనిష (19) , హేమంత్‌ కుమార్‌ (22) లుగా గుర్తించారు. వీరిద్దరూ బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో కుప్పం రైల్వే స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.