ఆదర్శం మున్సిపాలిటీయే లక్ష్యంగా అభివృద్ధి- మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి.

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) శంషాబాద్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీయే లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా రెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 24 వ వార్డు హుడా కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి వాటర్ పైప్ లైన్ పనులకు కౌన్సిలర్ కొనమొల భారతమ్మతో కలిసి శనివారం పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శంషాబాద్ మున్సిపాలిటీ ఏర్పడ్డాక అంచలంచలుగా 25 వార్డుల్లో అభివృద్ధి చేస్తున్నామని ఇంకా మిగిలి ఉన్న పనులు అన్నిటిని త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చి శంషాబాద్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతమిస్తూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించే విధంగా నూతన పైప్ లైన్లను ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ వెంకటేష్ గౌడ్,ఎచ్చ్ఎండ్ల్యూఎస్ డిఈ.గోవింద్ గౌడ్,మేనేజర్ హసీనా, నాయకులు కొనమొల శ్రీనివాస్, ప్రభాకర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : హుడ కాలనీలో మంచినీటి పైపు లైన్ పనులను ప్రారంభిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి.
Attachments area