ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయం

ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయం

మోత్కూరు సెప్టెంబర్ 25:
మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామానికి చెందిన పిల్లలమర్రి బంగారి అనారోగ్యం తో బాధపడుతూ ఆదివారం మృతి చెందగా మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన పొడిచేడు ఆరాధ్య ఫౌండేషన్ గ్రామ శాఖ అధ్యక్షుడు నర్రె సురేష్. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయం గా 25 కేజీల బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు మొదలగునవి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ నాయకులు పర్వతం షణ్ముఖ చారి, బిసు అనిల్, కాసార్ల సైదులు, దెందే మల్లేష్, జెట్ట మల్లేష్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.