ఆరేళ్ల బాలుడు చరణ్‌పై ఐదు కుక్కల దాడి

వరంగల్, జిల్లాలోని శాయంపేటలో పిచ్చికుక్కలు స్వైర్ విహారం చేస్తున్నాయి. గురువారం ఉదయం మలవిసర్జనకు వెళ్లిన ఆరేళ్ల బాలుడు చరణ్‌పై ఐదు కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. బాలుడి శరీరంపై ఎనిమిది చోట్ల కుక్కలు కరిచినట్లు స్థానిక వైద్యలు తెలిపారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.