ఆరోగ్య కేంద్రంలో అన్ని వసతులు కల్పించాలి

:ఎంపీపీ ఎల్లు భాయి బాబు :శామీర్ పేట్, జనం సాక్షి : ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సరి యైన వైద్యం లేక పిల్లలు చనిపోతున్నారని శామీర్ పేట్ ఎంపీపీ దాసరి ఎల్లు భాయి బాబు అన్నారు. శనివారం కోటిలో గల వైధ్య విదాన పరిషత్ కార్యాలయంలో గల కమీషనర్ కి శామీర్ పేట్ ఎంపీపీ ఎల్లు భాయి గ్రామంలో గల ప్రభుత్వ ఆసుపత్రి స్థితిగతులను వివరించారు .అలాగే సకాలంలో వైద్యం అందక చిన్న పాప పాముకాటుతో మరణించిన విషయం వివరించారు . కమీషనర్ సానుకూలంగా స్పందించి అతి తొందరగా మేరుగైన వైద్యం కొరకు డాక్టర్స్, సిబ్బంది, వాచ్ మెన్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
23 ఎస్పీటీ –1: కమీషనర్ కు వినతి పత్రం అందజేస్తున్న ఎంపీపీ