ఆర్టీసీలో నగదురహితానికి ప్రోత్సాహం: ఎండి

రాజమండ్రి,డిసెంబర్‌19(జ‌నంసాక్షి):ఆంధప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు అడుగులు వేస్తోంది. ప్రయాణీకులకు మరింత సులభతరం చేసేందుకు నగదు రహిత విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇకపై టికెట్‌ విధానం కాకుండా స్వైపింగ్‌ కార్డులు ప్రవేశపెట్టనున్నట్లు ఎపిఎస్‌ఆర్‌టిసి ఎండి సురేంద్రబాబు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఎండి సురేంద్రబాబు బుధవారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్‌టిసి లో ప్రయాణించేటప్పుడు టికెట్‌ కోసం నగదు ఇవ్వకుండా కార్డు స్వైప్‌ చేస్తే చాలని, టికెట్‌ జనరేట్‌ అయిపోతుందని తెలిపారు. టికెట్‌కు చెల్లించాల్సిన మొత్తం కార్డు నుంచి కట్‌ అవుతుందని చెప్పారు. ప్రతీ బస్సులో సీసీ కెమెరాలను అమర్చామని, ఇప్పటికే 96 శాతం బస్సు ట్రాకింగ్‌ పక్రియ అమలవుతోందని వెల్లడించారు.