ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన
విజయనగరం,నవంబర్26(జనంసాక్షి): ఆర్టీసీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరుతూ.. ఎపిఎస్ఆర్టిసి స్టాఫ్ అండ్ వర్క్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో విజయనగరం డిపో పరిధిలోని ఆర్టిసి కాంప్లెక్స్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వి.రాములు మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థలో విఆర్ ప్రతిపాదనలను విరమించుకోవాలన్నారు. వేతన సవరణ, సర్వీసు కండీషన్ ఒప్పందం వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. డిపో ప్రెసిడెంట్ ఎ.చంద్రయ్య మాట్లాడుతూ.. ఆర్టీసీలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, అద్దె బస్సు డ్రైవర్ లకు రిక్రూట్మెంటులో మొదటి ప్రధాన్యత ఇవ్వాలన్నారు. యువజన సంఘం నాయకుడు సురేష్ మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యలు పరిష్కారం కావాలంటే ఆర్టీసీలో వెంటనే రిక్రూట్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు.