ఆలయంలో పురాతన నంది విగ్రహం చోరీ

కాకినాడ,జనవరి24(జ‌నంసాక్షి): 70 ఏళ్లనాటి నంది విగ్రహాన్ని చోరీ చేసిన ఘటన గురువారం వెలుగు చూసింది. గతఅర్థరాత్రి దుండగులు రామచంద్రాపురం శివాలయంలో ఉన్న నంది విగ్రహాన్ని చోరీ చేశారు. సమాచారం అందిన వెంటనే సిఐ శివ గణెళిష్‌ ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించారు. సిఐ మాట్లాడుతూ.. దక్షిణ గుమ్మం ద్వారా విగ్రహాన్ని తరలించినట్టు తెలుస్తోందన్నారు. ఆలయం 200 ల సంవత్సరాల నాటిదని, అందులోని నంది విగ్రహం 70 ఏళ్లనాటిదని సిఐ తెలిపారు. విగ్రహం లోపల వజ్రాలుంటాయని భావించి దుండగులు చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సీసీ ఫుటేజ్‌ పరిశీలనకు సిఐ ఆదేశించారు. ఇన్నేళ్లుగా ఉన్న విగ్రహం చోరీ కావడం కీడు కలిగిస్తుందేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.