ఆలయాల్లో కార్తీకపౌర్ణమి శోభ

ఉదయాన్నే ఒత్తులు వెలగించిన మహిళలు

తులసి, ఉసిరి పూజలతో ధ్యానం

హైదరాబాద్‌/అమరావతి,నవంబర్‌23(జ‌నంసాక్షి): కార్తీక పౌర్ణమి పర్వదినంతో శివాలయాలు, వైష్ణవాల యాలు భక్తులతో కిటకిటలాడాయి. అలాగే పవిత్ర స్నానాలుచేసిన మహిళలు శివాలయంలో పెద్ద ఎత్తున్న వత్తులు వెలిగించే కార్యక్రమం చేశారు. ఉసిరికొమ్మలకు పూజలు చేయడం,ఉసిరి చెట్లకు ప్రదక్షిణలు చేయడం చేశారు. పలుచోట్ల గోమాతలకు పూజలు చేశారు. ప్రధాన ఆలయాలు కిలకిటలాగాయి. కార్తీక పౌర్ణమి శుక్రవారం రావడంతో తెలుగు రాష్ట్రాల్లో పుణ్యక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి.పౌర్ణమితో భక్తులు శివాలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక ఆరాధనలు చేశారు. ప్రజలు తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో భక్తుల కోలాహలం కనిపించింది. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం,మహానంది, భపంచారామాలు, కోటప్పకొండ, విజయవాడ కనకదుర్గ, శివనామస్మరణతో మార్మోగాయి. శ్రీశైలం పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ పరమశివుడిని ప్రార్థించారు. ఉసిరి కాయల్లో దీపారాధనలుచేశారు. ఆలయాల్లో ప్రత్యేకంగా ఒత్తులు వెలిగించే కార్యక్రమంచేపట్టారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శివాలయాలు భక్తుల రద్దీతో కిటకిట లాడాయి. అమరావతి, కోటప్పకొండ, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. విజయవాడలో కృష్ణాతీరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక మాస వేడుకల్లో భాగంగా ప్రాచీన ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి ఆలయాల్లో రుద్రాభిషేకాలు, ఇతర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ రాజన్న ఆలయం, కాళేశ్వరం,కీసర, ధర్మపురి, వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి,రామప్ప ఆలయం, కొడవటూరు ఆలయాలకు భక్తుల పోటెత్తారు. నల్లగొండ ఛాయా మహేశ్వరాలంలో భక్తులు పోటెత్తారు. కృష్ణాతీరం, గోదావరి తీరాల్లో తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి తీరంలో ఉన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. బాసరలో ప్రత్యేక పూజలకు తరలివచ్చారు. ఉదయాన్ని పుణ్యస్నానాలు ఆచరించి శివుడికి అభిషేకాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక మాసంలో జరిగే పుణ్యస్నానాలను పురస్కరించుకొని ఘాట్ల వద్ద అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. స్నానాలకు వచ్చిన భక్తులు ముందుగా గోదావరిస్నానాలు

ఆచరించి తులసి,ఉసిరి పూజలు నిర్వహించారు. వాయనాలను ఇచ్చి పుచ్చుకున్నారు. గోదావరి మాతకు పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి స్నానాలు ఆచరించారు. మొత్తంగా కార్తీక సోమవారం, పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రముఖ దేవాలయాలైన అన్నవరం, విజయవాడ, శ్రీశైలం, మహానంది, యాగంటి, రాజమండ్రి, ద్రాక్షారామం, కోటిపల్లి, సామర్లకోట, పిఠాపురం, బీమవరం, పాలకొల్లు దేవాలయాలకు భక్తులు భారీగా పోటెత్తారు. తెల్లవారుజామునే పుణ్యస్నానాల చేసి దర్శనాలు చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తున్నారు. పలువురు వ్యక్తులు అయ్యప్ప మాలలు ధరించారు. మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌లో పౌర్ణమి జ్యోతిని మంత్రి కొల్లు, ఎంపీ నారాయణ ప్రారంభించారు. మొత్తానికి దేవాలయాలన్నీ కార్తీక శోభను సంతరించుకున్నాయి. యాదాద్రిలో

కార్తీకసత్యనారాయణ స్వామి వ్రతాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. భక్తులకు రాకతో ఆలయం కిటకిటలాడింది. జిల్లాలోని చెరువుగట్టు, వాడపల్లి, పానగల్‌ దేవాలయాలకు భక్తులు భారీగా పోటెత్తారు. ఈరోజు కార్తీకపౌర్ణమి సందర్భంగా భక్తులు స్వామివారు, అమ్మవార్లను దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలువురు వ్యక్తులు అయ్యప్ప మాలలు ధరించారు. ఇలా భక్తులతో దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి.