ఆలయాల్లో వరుస చోరీలు

గుంటూరు,జనవరి22(జ‌నంసాక్షి): ఒకే రోజు రెండు ఆలయాల్లో చోరీ జరిగిన ఘటన మంగళవారం ప్రత్తిపాడులో చోటు చేసుకుంది. ప్రత్తిపాడులోని దేవాలయాల్లో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని రెండు ఆలయాల్లో ఈ రోజు చోరీలు జరిగాయి. ప్రత్తిపాడు రామాలయం ఆలయంలో తలుపులు పగలకొట్టిన దొంగలు హుండీలో సొమ్ముని దోచేసి, హుండీ ని స్థానిక చెరువులో పడేశారు. మరో వైపు.. ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు గ్రామంలోని విజ్ఞేశ్వరాలయంలో కూడా దొంగలు చొరబడి ఆలయ తాళాలు పగలగొట్టి, హుండీలో సొమ్ము దోచుకొని హుండీని తీసుకువెళ్లి ఊరు చివర పొలాల్లో పడేశారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై బాలకృష్ణ దొంగతనం జరిగిన విధానాన్ని పరిశీలిస్తున్నారు. ఒకే రోజు రెండు ఆలయాల్లో ఒకే విధంగా దొంగతనం జరగడం విశేషం. గొట్టిపాడు గ్రామంలో దొంగతనం జరగడం ఈ నెలలో రెండో సారి. గొట్టిపాడు గ్రామంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోయారు.