ఆలయ అభివృద్ధి కి తన వంతు కృషి జడ్పీటీసీ స్వప్నభాస్కర్

జహీరాబాద్ నవంబర్ 10( జనం సాక్షి)  ఆలయ అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తునట్లు  జడ్పీటీసీ స్వప్నభాస్కర్ అన్నారు. గురువారం  న్యాల్కల్ మండలం,మల్గి గ్రామంలో శ్రీ నావనాథ సిద్దేశ్వర స్వామి టెంపుల్ కు వెళ్లే మార్గానికి ఎంపీటీసీ నిధులతో 3 లక్షల రూపాయల సిసి రోడ్డు పనులను ప్రారంభించిన జడ్పీటీసీ స్వప్నభాస్కర్.ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్దే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం అన్నారు..రాబోయే రోజుల్లో శ్రీ నావనాథ సిద్దేశ్వర స్వామి టెంపుల్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయుటకు తన వంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,స్థానిక సర్పంచ్ మారుతీ,ఎంపీటీసీ శివనందశ్రీపతి, వైస్ ఎంపీపీ గౌసొద్దీన్,మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవి కుమార్, అత్నూర్ సర్పంచ్ సంగ్రామ్ పాటిల్,ఆత్మ డైరెక్టర్ రాజు,బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సిద్దారెడ్డి,సంగమేష్,వార్డ్ మెంబెర్ విట్టల్,కమిటీ మెంబెర్స్ నర్సింహా రెడ్డి,భద్రు స్వామి తదితరులు పాల్గొన్నారు