ఆశావర్కర్ల సమ్మెకు సంఘీభావం తెలిపిన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి రాజగోపాల్

అలంపూర్ సెప్టెంబర్ 28(జనంసాక్షి )
అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్ పట్టణంలో గత కోన్ని రోజులుగా జరుగుతున్న ఆశావర్కర్ల సమ్మెకు గురువారం బిజెపి నాయకులు రాజగోపాల్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఉద్యోగి కూడా సంతోషంగా లేరని, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు నెలసరి జీతాలు మొదటి తేదీనే వచ్చేవని ఇప్పుడున్న ప్రభుత్వంలో 15వ తారీకు వచ్చిన నెలసరి జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు రావడంలేదని అన్నారు.చాలా రోజులుగా ఆశావర్కర్లు సమ్మె చేపడుతున్న ప్రభుత్వం, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పట్టించుకోవడంలేదని అన్నారు. ఆశావర్కర్ల సమ్మెకు బిజెపి పార్టీ అండగా ఉంటుందని,వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశావర్కర్లను ప్రభుత్వం చర్చలకు పిలిచి వారి డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగమల్లయ్య వల్తటి శ్రీధర్ ఉండవల్లి మండల ఉపాధ్యక్షుడు కృష్ణ అల్లంపూర్ టౌన్ బీజేవైఎం అధ్యక్షుడు శరత్ తదితరులు పాల్గొన్నారు.