ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి.

– బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
బెల్లంపల్లి, జులై 22, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శుక్రవారం ఆయన ఆసుపత్రి నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణ పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని, వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట జడ్పీ వైస్ ఛైర్మన్ తొంగల సత్యనారాయణ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ బత్తుల సుదర్శన్, నాయకులు గడ్డం భీమా గౌడ్, సన్నీ బాబు, నిరంజన్, అధికారులు ఉన్నారు.