ఆస్తి పన్ను బకాయిలపై ఆఫర్

మేడిపల్లి – జనంసాక్షి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో నివాస, వ్యాపార, ఇతరముల  ఆస్తి పన్ను బకాయిపై గల వడ్డీపై 2021-22 వరకు 90 శాతం రాయితీ ప్రకటించినట్టు బోడుప్పల్ నగర పాలక సంస్థ మేయర్, కమీషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశం ఒన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) ద్వారా వినియోగించుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. అక్టోబర్ 31, 2022 వరకు మాత్రమే అవకాశం ఉందని, బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో గల ఆస్తి పన్ను బకాయిదారులు ఈ సువర్ణ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోగలరని విజ్ఞప్తి చేశారు.