ఇండియన్స్ యూత్ ఆధ్వర్యంలో గణేశుని దగ్గర అన్నదానం

ఇండియన్స్ యూత్ ఆధ్వర్యంలో గణేశుని దగ్గర అన్నదానం

 

వనపర్తి బ్యూరో సెప్టెంబర్26 (జనంసాక్షి)
వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ లో ఇండియన్స్ యూత్ ఆధ్వర్యంలో కొలువు ధిరిన గణేశుని ని మండపం దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.భక్తి శ్రద్ధలతో రోజు పూజలందుకుంటున్న గణనాథుడు నేటికి 9వ రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు యూత్ సభ్యులు తెలియజేశారు.21 సంవత్సరాలు గా వినాయక చవితి సంధర్భంగా విగ్రహం ఏర్పాటు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు. వనపర్తి తో పాటు 19,20 వార్డు లకు చెందిన ప్రజలు సుఖసంతోషాలతో, ఆయుఆరోగ్యలతో,సంపదతో తులతూగలని మనసారా కోరుకుంటు గణేశుడికి నిత్యా పూజలు నిర్వహిస్తున్నారు.గణేశుని కి సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందులో భాగంగానే మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం.రవి.రాజశేఖర్.రాజేష్.చిన్న .రఘు.రమేష్.శివ.శశి.రవి.రాకేష్ యూత్ సభ్యులు తెలిపారు.