ఇండియన్‌ బ్యాంక్‌లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

 

 

 

 

 

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయినC విడుదలైంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని, ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 9 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 202 పోస్టులను భర్తీ చేస్తున్నది. పదో తరగతి పాసైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

మొత్తం ఖాళీలు: 202
అర్హతలు: అభ్యర్థులు తప్పనిసరిగా ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అయి, 26 ఏండ్లు నిండినవారై ఉండాలి. పదో తరగతిపాసై స్థానిక భాషలో చదవడం, రాయడం వచ్చి ఉండాలి. డిగ్రీ, ఆపై విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేయడానికి అనర్హులు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 9