ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ధరూర్ మండల కమిటీ ఏర్పాటు…

గద్వాల ప్రతినిధి సెప్టెంబరు 22 (జనంసాక్షి):- ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,తెలంగాణ రాష్ట్ర చైర్మన్, అజయ్ మిశ్రా ఉత్తర్వులను అనుసరించి జోగుళాంబ గద్వాల జిల్లా గౌరవ కలెక్టరు గారి ఆదేశాల మేరకు గురువారం ధరూర్ తహసిల్దారు కార్యాలయంలో మండల కమిటి ఏర్పాటుకై సమావేశం జరిగింది..జోగులాంబ గద్వాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జి రమేష్ పర్యవేక్షణలో ఏర్పడిన రెడ్ క్రాస్ మండల శాఖ కమిటీలో ప్రెసిడెంట్ గా  ఎం. నరేష్ గారు మండల తహసీల్దార్, వైస్ ప్రెసిడెంట్ లు గా మండల ఎంపీడీవో శ్రీ అబ్దుల్ జబ్బార్, సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ కె శేఖర్ రెడ్డి గార్లు, కార్యనిర్వాహక సభ్యులుగా డాక్టర్ జి. స్రవంతి మెడికల్ ఆఫీసర్, ఎం రాముడు(మెడికల్ ఆఫీసర్), జి సురేష్ మండల విద్యాధికారి, ఎన్ తిరుపతి రెడ్డి గ్రామపంచాయతీ సెక్రటరీ, మండల రెడ్ క్రాస్ కార్యదర్శిగా ఎండి నౌషిత్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది..ఈ సమావేశంలో ఎన్నికైన కమిటీ సభ్యులచే రెడ్ క్రాస్ సొసైటీకీ సంబంధించిన నియమ నిబంధనలతో ప్రమాణము చేయించడం జరిగింది.ఈ సందర్బంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ….  మండల స్థాయిలో జరిగే రక్తదాన, ఆరోగ్య, ప్రేరణ వంటి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటామని, సభ్యత్వ కార్యక్రమం విరివిగా చేపడుతామని రెడ్ క్రాస్ సొసైటీని బలోపేతం చేస్తామని అందరూ తెలియజేసారు..