ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా ప్రచారానికి విశేష ఆదరణ : చిరంజీవి

ఢిల్లీ: విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర పర్యాటక శాఖమంత్రి చిరంజీవి అన్నారు. లండన్‌ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ మూడు విభాగాల్లో ఇండియా ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తుందని జీ 20 సదస్సు అభిప్రాపడిందన్నారు. ఇమ్మిగ్రేషన్‌ సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.